టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:53 PM
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 49 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
మహబూబ్నగర్ విద్యావిభాగం, ఏప్రిల్ 21: రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 49 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. 11,665 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావల్సి ఉండగా.. 9,920 మంది హాజరయ్యారు. 1,745 మంది గైర్హాజరు అయ్యారు. అంటే 85.04 శాతం మంది విద్యార్థులు హాజరు శాతం నమోదైంది. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. వారి తల్లిదండ్రులు, బంధువుల రాకతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్ష కేంద్రాలను డీఈవో రవీందర్, అధికారులు పర్యవేక్షించారు.