Share News

జాతిపితకు ఘన నివాళి

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:59 PM

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు.

జాతిపితకు ఘన నివాళి
మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

- గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసిన ప్రజాప్రతినిధులు

- ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

నారాయణపేట, జనవరి 30 : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్‌ పాండురెడ్డి, నాయకులు రఘువీర్‌, రఘురామయ్య, వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య, రాము, హన్మంత్‌రావు, అశోక్‌, సైదప్ప, భరత్‌ పాల్గొన్నారు.

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పులవురు వక్తలు మాట్లాడుతూ శాంతి, ధర్మ, అహింస మార్గంలో నడుస్తూ బ్రిటీష్‌ పాలకులను సాగనంపారన్నారు. మహాత్ముడు మన ఆర్యవైశ్య జాతిలో పుట్టడం మనకు గర్వకారణం అన్నారు. ప్రతీ ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆలయ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌గుప్తా, అధ్యక్షుడు కట్ట సురేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌, వట్టం రతన్‌కుమార్‌గుప్తా, లక్ష్మణ్‌, రఘు, శ్రీనివాస్‌, సతీష్‌, బుచ్చయ్య, మహిళలు మన్సాని సరళ, సుజాత, పల్లవి, సంధ్య, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:59 PM