ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:36 PM
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ది ఏకపక్ష గెలుపు అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు.
![ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం](https://media.andhrajyothy.com/media/2024/20240413/2ngk14_8988a01436.jpg)
- ఎంపీ అభ్యర్థి మల్లురవి
తెలకపల్లి, ఏప్రిల్ 14 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ది ఏకపక్ష గెలుపు అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. మిగతా బీఆర్ఎస్, బీజేపీలు రెండవ స్థానం, మూడవ స్థానం కోసం పడాల్సిందేనని వారన్నారు. అంతకుముందు తెలకపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వారన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్షో నిర్వహించారు.
కాంగ్రెస్తోనే సంపూర్ణ అభివృద్ది
తాడూరు: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితేనే బడుగు బలహీన వర్గాలతోపాటు పేద, మధ్య తరగతివర్గాలకు చెందిన వారందరికీ సం పూర్ణ న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని కొనసాగించారు. ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డితోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్షోలో వారు మాట్లాడారు. తాడూరు జడ్పీటీసీ సభ్యురాలు మందడి రోహిణి, తెలకపల్లి జడ్పీ టీసీ సభ్యురాలు సుమిత్రతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బిజినేపల్లి: నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. మండల కేంద్రంలోని ఎంజేఆర్ ఫంక్షన్ హాల్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఆదివారం రోడ్డు షో నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళ్ళు అర్పించి మాట్లాడారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచ కుళ్ల రాజేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు మిద్దె రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయ కులు అమృత్ రెడ్డి, గంగనమోని తిరుపతయ్య, మాన్యనాయక్, భగవంత్ గౌడ్, బాల్రాజు, మిద్దె మల్లేష్, మస్కూరి బంగారయ్య, కర్నాటి తిరుపతయ్య, మోహన్ రెడ్డి, నజీర్, మహేందర్, కత్తె ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట : కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు. తిమ్మాజిపేట మండల కేంద్రం లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మల్లురవి మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహా నికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మ ల్లయ్యగౌడ్, శ్రీనివాస్ బహుదూర్, దానం బాలరాజు, వెంకట్రామిరెడ్డి, మాధవు లు, ఉస్మాన్రవూఫ్, నాయసాయిలు, వరుణ్కుమార్, సహదేవ్ పా ల్గొన్నారు.