Share News

గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - May 27 , 2024 | 11:00 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామ సమీపంలో హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి కారు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి.

గాయపడిన వ్యక్తి మృతి

వెల్దండ, మే 27: నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామ సమీపంలో హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి కారు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరు సోమవారం చనిపోగా, మరొకరు చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన రమేష్‌(45) అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య ట్రాక్టర్‌పై ఆదివారం రాత్రి కల్వకుర్తికి వస్తుండగా నాగర్‌కర్నూల్‌ వైపు వెళుతున్న జిల్లా కేంద్రానికి చెందిన మోహన్‌గౌడ్‌ కారు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న రమేష్‌, కృష్ణ య్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెల్దండలోని యె న్నం ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ సోమవారం చనిపోయాడు. రమేష్‌ భార్య యాదమ్మ ఫిర్యాదుతో మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - May 27 , 2024 | 11:00 PM