హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:07 PM
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు.
- మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్
వెల్దండ, ఏప్రిల్ 19 : ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమనగల్లులోని శ్రీలక్ష్మి గార్డెన్లో శనివారం పార్టీ నియోజకవర్గస్ధాయి విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండలాల నుంచి పెద్దఎత్తున పార్టీశ్రేణులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాగర్కర్నూల్ నుంచి ఉన్నత విద్యావంతుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా కృషిచేయాలని జైపాల్యాదవ్ కోరారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు వెంకటయ్యగౌడ్, విజయ్గౌడ్, శేఖర్, నిరంజన్, మధుసూదన్రెడ్డి, అర్జున్రావు, శ్రీనివాస్యాదవ్, పత్యానాయక్, దశరథ్నాయక్, బీమయ్యగౌడ్, ఎంగలి రఘు, ఆనందు, ఎల్ఎన్రెడ్డి ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
చెర్కూర్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ నర్సింహ తండ్రి పురుగుల లింగయ్య ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. లింగయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు బీమయ్యగౌడ్, మైసయ్య, కొండల్, లాలయ్య, సైదులు, సతీష్, సుమన్నాయక్ ఉన్నారు.