ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:26 PM
నడిగడ్డలో విద్యా వ్యాప్తి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపా ధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్ కోరారు.
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్
గద్వాల టౌన్, ఏప్రిల్ 26 : నడిగడ్డలో విద్యా వ్యాప్తి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపా ధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్ కోరారు. అవసరమైనే అందుకోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహిం చాలన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయం లో రెండు రోజులు నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ము గింపు సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ జిల్లాలోని అయిజ పట్టణంలో డిగ్రీ కళాశాలతో పాటు రాజోలి, ఎర్రవల్లి, కేటీదొడ్డి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ‘మన ఊరు-మన బడి’ పథకంలో చేపట్టిన పాఠశాలల పునర్నిర్మాణ పనులను విద్యా సంవత్సరం ఆరంభ మయ్యేనాటికి పూర్తి చేయాలన్నారు. గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ మాట్లాడుతూ విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. సమావే శంలో యూనియన్ జిల్లా కన్వీనర్ అంజి, కోకన్వీనర్ శివకుమార్, కమిటీ సభ్యులు సూర్యకుమార్, పరశురాం, కార్తీక్, పార్థు, కిరణ్, సూర్య పాల్గొన్నారు.