Share News

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ..

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:12 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ ఎంపీటీసీ సభ్యుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ..
ఓటు వేసిన అనంతరం ఎంపీటీసీ సభ్యుడిని అంబులెన్స్‌ వాహనం ఎక్కిస్తున్న సిబ్బంది

వనపర్తి అర్బన్‌, మార్చి 28: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ ఎంపీటీసీ సభ్యుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గోపాల్‌పేట మండలంలోని ఏదుల ఫేజ్‌ 1 ఎంపీటీసీ సభ్యుడు నరేందర్‌ రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన ప్రత్యేక అంబులెన్స్‌లో నేరుగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. నరేందర్‌కు శరీరంలో స్పర్శ లేకపోవడంతో అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని నరేందర్‌ భార్య కవిత భర్త ఓటును వేశారు. అనంతరం తిరిగి అతడిని ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Mar 29 , 2024 | 12:12 AM