Share News

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 27 , 2024 | 10:44 PM

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవయాధికారి జాన్‌ సుధాకర్‌ పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఫర్టిలైజర్‌ దుకాణంలో స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేస్తున్న జిల్లా వ్యవసాయాధికారి జాన్‌ సుధాకర్‌

- జిల్లా వ్యవసాయాధికారి జాన్‌ సుధాకర్‌

- ఫర్టిలైజర్‌ దుకాణాల తనిఖీ

కృష్ణ, మే 27 : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవయాధికారి జాన్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని విత్తన మరియు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్‌ షాపు నందు స్టాక్‌ రికార్డులు, బిల్‌ బుక్కులు పరిశీలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విత్తన డీలర్లకు విత్తనాలు పర్మిషన్‌ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే తీసుకోవాలన్నారు. సీడ్‌ లైసెన్స్‌ కొనుగోలు దారులకు కనిపించే విధంగా పెట్టాలని, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఉంచాలన్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేయరాదని హెచ్చరించారు. అదే విధంగా నిషేధిత బీటీ-3 విత్తనాలు ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్ర మంలో మండల వ్యవసాయాధికారి సుదర్శన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మాగనూరు : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని మాగనూరు వ్య వసాయ శాఖ ఇన్‌చార్జి అధికారి సుదర్శన్‌గౌడ్‌ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణంలోని స్టాక్‌ రిజి స్టర్లు, బిల్లు బుక్కులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు విత్తనాల పర్మిషన్‌ ఉన్న కంపెనీ నుంచి మాత్రమే విత్తనా లు కొనుగోలు చేసి రైతులకు అమ్మకాలు చేయాలన్నారు. విత్తన డీలర్లు విధిగా షాపు యొక్క పేరు, డోర్‌ నెంబర్‌ కనిపించే విధంగా పెట్టాలని, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా పెట్టాలన్నారు.

Updated Date - May 27 , 2024 | 10:44 PM