Share News

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:27 PM

ల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ను కోరారు.

జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కలెక్టర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

- కలెక్టర్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చర్చలు

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 6 : జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ను కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వారు ఆయనతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వర్షాకాలంలో కొన్ని గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఆయా గ్రామాలకు మట్టి రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, అందుకు ప్రభు త్వంతో మాట్లాడి కృషి చేయాలని కోరారు. గద్వాల నియోజకవర్గంలో గత ప్రభుత్వం ప్రత్యేక నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు.

Updated Date - Jun 06 , 2024 | 11:27 PM