Share News

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:34 PM

పకడ్బందీగా వరి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశిం చారు.

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : పకడ్బందీగా వరి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వానాకాలం వరి కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేరు వే రుగా పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో ఒకే కొను గోలు కేంద్రంలో సన్న రకం, దొడ్డు రకం సేకరించడానికి వీలు లేదని ఆదేశించారు. ఆయా గ్రామాల పరిధిలో ధాన్యం ఉత్పత్తిని బట్టి గ్రామంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. సన్నరకం ఎన్ని పెట్టాలి.. దొడ్డు రకం ఎన్ని పెట్టాలి.. అనేది ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పౌరస రఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారు లు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయా లని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూ సుకోవాలని తెలిపారు. ఏ రైతు తన ధాన్యాన్ని ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రానికి తీ సుకువెళ్లాలి అనేది వ్యవసాయ విస్తీర్ణాధికారి ద్వారా రైతుకు సమాచారం వెళ్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్‌ల కొరత లేకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నా రు. అదనపు కలెక్టర్‌ నగేష్‌, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌ నాయక్‌, పీడీ డీఆర్‌ డీఏ ఉమాదేవి, పౌర సరఫరాల శాఖ అధి కారి కాశీ విశ్వనాథ్‌, డీఎం సివిల్‌ సప్లయ్‌ ఇర్ఫాన్‌, డీపీఎం అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:34 PM