Share News

ఇంటింటికీ రాములవారి అక్షింతలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:49 PM

వడ్డేపల్లి మునిసిపాలిటీ పరిధి లోని రామచంద్రానగర్‌లో కాలనీ యువకుల ఆధ్వ ర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ఇంటింటికి తిరుగుతూ రాముల వారి అక్షింతలను పంపిణీ చేశారు.

ఇంటింటికీ రాములవారి అక్షింతలు
వడ్డేపల్లిలో అక్షింతలను పంచుతున్న బీజేపీ నాయకులు

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వడ్డేపల్లి/ మానవపాడు/ ధరూరు/ అలంపూర్‌ చౌరస్తా, జనవరి 8 : వడ్డేపల్లి మునిసిపాలిటీ పరిధి లోని రామచంద్రానగర్‌లో కాలనీ యువకుల ఆధ్వ ర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ఇంటింటికి తిరుగుతూ రాముల వారి అక్షింతలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, రవి, మహేష్‌ పాల్గొన్నారు.

- అయోధ్య రాముల వారి అక్షింతలు సోమవారం మానవపాడు మండలంలోని జల్లాపూరం గ్రామానికి చేరాయి. విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు, భక్తులు భక్తి గీతాలు, భజనలతో అక్షింతలను ఉరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తీసుకెళ్లారు. వాటిని ప్రజ లకు పంపిణీ చేస్తామని భక్తులు సోమన్న, నరేందర్‌, సుగుణకర్‌రెడ్డి, కరుణసింహారెడ్డి, భద్రయ్య తెలిపారు.

- ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లిలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ పూజిత అక్షిం తలను సోమవారం ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామం లో శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్ర మంలో ముదిరాజ్‌ యూత్‌ జిల్లా అధ్యక్షుడు పాండు, సర్పంచు నాగన్న, గ్రామపెద్దలు భీంరెడ్డి, లక్ష్మన్న, ధర్మన్న, జయన్న, పరశురాముడు, వీరేష్‌, చిన్న గోవిందు పాల్గొన్నారు.

- రాములవారి అంక్షింతలు సోమవారం ఉండవల్లి మండల పరిధిలోని ఇటిక్యాలపాడు గ్రామానికి చేరాయి. ఈ సందర్భంగా భక్తులు వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లి, ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అక్షింతలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తామని వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు తెలిపారు.

Updated Date - Jan 08 , 2024 | 10:49 PM