విధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:08 PM
గత రెండు నెలలుగా ఎన్నికల విధు ల పట్ల ఉన్న సిబ్బంది అంద రూ ఇకనుంచి తమ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి ముం దుకెళ్లాలని ఆర్డీవో కే.సురేష్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
![విధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240604/7ngk11_jpeg_bf61ee1275.jpg)
- నాగర్కర్నూల్ ఆర్డీవో కే.సురేష్
తాడూరు, జూన్ 11 : గత రెండు నెలలుగా ఎన్నికల విధు ల పట్ల ఉన్న సిబ్బంది అంద రూ ఇకనుంచి తమ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి ముం దుకెళ్లాలని ఆర్డీవో కే.సురేష్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేం ద్రంలోని తహసీల్దార్ కార్యాల యాన్ని ఆయన ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పట్ల అన్ని స్థాయిలో ఉన్న అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి అలసత్వం వహించకుండా ఎప్పటి రిజిస్ట్రేషన్లు అప్పుడే పూర్తిచేసే విధంగా ముందుకెళ్లాలన్నారు. అత్యవసరమైన విద్యా ర్థుల సర్టిఫికెట్లను పెండింగ్లో ఉంచుకోకుండా త్వరితగతిన ఆన్లైన్లో పొందుపర్చి సర్టిఫికెట్లు వచ్చే విధంగా చూడాలన్నారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే అలాంటి వారిపై శాఖాపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై తహసీల్దార్ ప్రమీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.