Share News

నరసింహస్వామికి పట్టువస్త్రాల సమర్పణ

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:16 PM

అహోబిళంలోని రుద్రవరం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సమర్పించారు.

నరసింహస్వామికి పట్టువస్త్రాల సమర్పణ
పట్టు వస్ర్తాలను తీసుకొస్తున్న కమిషనర్‌ అనీల్‌కుమార్‌, అర్చకులు

అలంపూర్‌, ఫిబ్రవరి 28 : అహోబిళంలోని రుద్రవరం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సమర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, అలంపూర్‌ జోగుళాంబ ఆలయ ఈవో పురందర్‌ కుమార్‌, చైర్మన్‌ చిన్న కృష్ణయ్య, అర్చకుడు ఆనంద్‌శర్మతో కలిసి బుధవారం అహోబిళమఠానికి చేరుకోగా, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ కాకతీయ వంశంలోని ప్రతాపరుద్రవర్మ అహోబిళం దగ్గరలోని రుద్రవరం అనే గ్రామంలో నిర్మించిన నరసింహస్వామి ఆలయ ప్రాశస్య్తాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అందుకు స్పందించిన ప్రభుత్వం అధికార లాంఛనాలతో పట్టువస్ర్తాలను సమర్పించినట్లు చెప్పారు.

Updated Date - Feb 28 , 2024 | 11:16 PM