నరసింహస్వామికి పట్టువస్త్రాల సమర్పణ
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:16 PM
అహోబిళంలోని రుద్రవరం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సమర్పించారు.
![నరసింహస్వామికి పట్టువస్త్రాల సమర్పణ](https://media.andhrajyothy.com/media/2024/20240227/01_Alp28_6d96940484.jpg)
అలంపూర్, ఫిబ్రవరి 28 : అహోబిళంలోని రుద్రవరం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సమర్పించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, అలంపూర్ జోగుళాంబ ఆలయ ఈవో పురందర్ కుమార్, చైర్మన్ చిన్న కృష్ణయ్య, అర్చకుడు ఆనంద్శర్మతో కలిసి బుధవారం అహోబిళమఠానికి చేరుకోగా, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనీల్కుమార్ మాట్లాడుతూ కాకతీయ వంశంలోని ప్రతాపరుద్రవర్మ అహోబిళం దగ్గరలోని రుద్రవరం అనే గ్రామంలో నిర్మించిన నరసింహస్వామి ఆలయ ప్రాశస్య్తాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అందుకు స్పందించిన ప్రభుత్వం అధికార లాంఛనాలతో పట్టువస్ర్తాలను సమర్పించినట్లు చెప్పారు.