Share News

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:12 PM

జూన్‌ ఎని మిదో తేదీన నిర్వహించనున్న జాతీ య లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయాధికారి కె.కుష అన్నారు.

లోక్‌ అదాలత్‌ను జయప్రదం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారి కె.కుష

- జిల్లా న్యాయాధికారి కె.కుష

గద్వాల క్రైం, మే 25 : జూన్‌ ఎని మిదో తేదీన నిర్వహించనున్న జాతీ య లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయాధికారి కె.కుష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో పోలీస్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ రాజీ కాదగిన క్రిమినల్‌ కేసుల్లో ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి ఎక్కువ సం ఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృథా కాకుండా రాజీద్వారా కేసులు పరిష్కరించేందు కు సహకరించాలన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించి రాష్ట్రంలో ప్రథమస్ధానం నిలిచేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు శ్రేణి న్యాయమూర్తి ఉదయ్‌నాయక్‌, డీఎస్పీ సత్యనారాయణ, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ త్రిపాఠి, ఏపీపీలు రేచల్‌, సంజన, జాషువా, భవాని, సీఐ భీంకుమార్‌, ఆయా స్టేషన్ల ఎస్సైలు, లోక్‌ అదాలత్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:12 PM