సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:19 PM
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పాన్గల్, ఏప్రిల్ 19: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్, బహూదూర్ గూడెం, బండపల్లి, జమ్మాపూర్, తెల్లరాళ్లపల్లి గ్రామాలలో నిర్వహించిన కార్యకర్త ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయాలు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్, సింగిల్విండో మాజీ ఉపాధ్యక్షుడే భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచులు రాణి, విష్ణు, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్సాగర్, పుల్లరావు, దశరథ్, బ్రహ్మయ్య, దుర్గయ్య, నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.