వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
ABN , Publish Date - Mar 24 , 2024 | 10:06 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీ చిన్నకృష్ణ (55) ఆదివారం వడదెబ్బతో మరణించాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నకృష్ణ ఉపాధి పనులకు వెళ్తున్నాడు.
![వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎర్రవల్లి, మార్చి 24 : జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీ చిన్నకృష్ణ (55) ఆదివారం వడదెబ్బతో మరణించాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నకృష్ణ ఉపాధి పనులకు వెళ్తున్నాడు. శనివారం పనికి వెళ్లిన ఆయన వడదెబ్బకు గురై అక్కడే కుప్ప కూలిపోయాడు. తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన చికిత్స చేయడంతో కోలుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన అదే రోజు అర్ధరాత్రి తర్వాత పరిస్థితి విషమించి చనిపోయినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.