Share News

తెలంగాణ కల సాకారం చేసిన కేసీఆర్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:47 PM

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పద్నాగేళ్లు మొక్కవోని ధైర్యంలో అలు పెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీ ఆర్‌ ప్రజల కల సాకారం చేశారని నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ కల సాకారం చేసిన కేసీఆర్‌
బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ జెండావిష్కరణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు

- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలు ముగింపు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 3: ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పద్నాగేళ్లు మొక్కవోని ధైర్యంలో అలు పెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీ ఆర్‌ ప్రజల కల సాకారం చేశారని నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి జాతీయ జెండా, బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్ర హానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రోడ్డు ప్ర మాదంలో చనిపోయిన నాగర్‌కర్నూల్‌ మండలం గుడిప ల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త గువ్వల రమే ష్‌ కుటుంబానికి పార్టీ ప్రమాద బీమా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. తదనంతరం జిల్లా ఆసుపత్రి చే రుకుని గర్భిణులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నాగం శశీధర్‌రెడ్డి, బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు శ్రీశైలం, ముని సిపల్‌ చైర్‌ పర్సన్‌ కల్పన, నాయకులు బచ్చలకూర లక్ష్మ య్య, బుసిరెడ్డి చంద్ర శేఖర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్‌, ర మేష్‌గౌడ్‌, హనుమంతరా వు, ఐతోలు లక్ష్మయ్య, బా లాగౌడ్‌ తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:47 PM