రైతులకు సాగునీరు అందించాలి
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:10 PM
మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎంపీపీ కృ ష్ణానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- కెఎల్ఐ డీ8 కాలువ వద్ద నీళ్లలోకి దిగి బీఆర్ఎస్ నాయకుల నిరసన
ఖిల్లాఘణపురం, ఆగస్టు 1 : మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎంపీపీ కృ ష్ణానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలానికి సాగునీరు రావడం లేదని ఆ పార్టీ నాయ కులు గురువారం బిజినేపల్లి మం డలం మంగనూరు శివారులోని కెఎల్ఐ డీ8 కాలువ వద్ద నీళ్లలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఘణ పురం బ్రాంచ్ కెనాల్కు సాగునీ రు రాకుండా పెద్దపెద్ద బండరాళ్లు, ముళ్ల కంపను అడ్డు వేసి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తు న్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో వరి నాట్లు ప్రారంభమవుతున్నాయని సకాలంలో సాగు నీరు అందించలేకపోతే రైతులు నష్టపోతారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు సామ్యనాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.