Share News

పారదర్శకంగా ఈవీఎంల తనిఖీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:52 PM

జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల మొదటి స్థాయి తనిఖీ పారదర్శకంగా ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

పారదర్శకంగా ఈవీఎంల తనిఖీ
ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 7 : జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల మొదటి స్థాయి తనిఖీ పారదర్శకంగా ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎఫ్‌ఎల్‌సీ, ఈవీఎంలను భద్రపరచడం అంశాలపై బుధవారం కలెక్టర్‌ పరిశీలించి, మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీల సమక్షంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు ఈసీఐఎల్‌ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో ఎఫ్‌ఎల్‌సీ, ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎఫ్‌ఎల్‌సీ నిర్వహాణ, గోడౌన్‌లో ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్‌ , కంట్రోలింగ్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ యంత్రాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌, ఆర్డీవో రాంచందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 10:52 PM