దుందుభీకి వరద
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:44 PM
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దుందుభీ నదికి వరద వస్తోంది.
-సిర్సవాడ, పాపగల్ గ్రామాల వద్ద నిలిచిన రాకపోకలు
తాడూరు, సెప్టెంబరు 26 : ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దుందుభీ నదికి వరద వస్తోంది. గురువారం మండలంలోని దుందుభీ నది ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాపగల్, సిర్సవాడ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు చుట్టూ తిరుగుతూ ఇటు జడ్చర్ల, అటు మేడిపూర్ రహదారులపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దుందుభీ నది అవతలి ఒడ్డున వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు నది దాటే పరిస్థితి లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.