కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:02 PM
కాంగ్రెస్ అంటేనే మోసం దగా అని, కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
మాగనూరు, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ అంటేనే మోసం దగా అని, కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. గురువారం మండలంలోని అడవిసత్కారం, కొల్పూరు, వడ్వాటు, మాగనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలం టే బీజేపీని గెలిపించాలని కోరారు. తిరిగి బీజేపీ గూటికి చేరుకున్న మాజీ బీజేపీ అధ్యక్షుడు జయందర్రెడ్డి, జయనందరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణ మండలం ముడుమాల్, మురహర్దొడ్డి, గుడెబల్లూరు, కున్సీ, ఆలంపాలి, చేగుంట గ్రామాల్లో డీకే అరుణ సుడి గాలి పర్యటన చేశారు. అదే విధంగా మక్తల్ మండలంలోని సంగం బండ, లింగంపల్లి గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, ఎంపీపీ శ్యామలమ్మ, బీజేపీ జిల్లా నాయకుడు కర్నిస్వామి, మాగనూరు మండలాధ్యక్షుడు గొల్ల నారాయణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కనకరాజు, ఓబీసీ జిల్లా నాయకుడు వాకిటి మల్లేష్, భీంరాజు, పరశురాం, అమరకుమార్దీక్షత్, మజ్జిగ సురేష్, సోమశేఖర్ గౌడ్, శ్రీనివాస్, రాజు, భీరప్ప, నల్లే నర్సప్ప, దండ రాఘవేంద్ర పాల్గొన్నారు.