Share News

బూటకపు హామీలతో కాంగ్రెస్‌ గద్దెనెక్కింది

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:09 PM

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీ ణ్‌కుమార్‌ విమర్శించారు.

బూటకపు హామీలతో కాంగ్రెస్‌ గద్దెనెక్కింది
కొల్లాపూర్‌లో ప్రచారం ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 19 : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీ ణ్‌కుమార్‌ విమర్శించారు. శుక్రవారం సాయంత్రం కొల్లాపూర్‌ పట్టణంలో బీఆర్‌ ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కొల్లాపూర్‌ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ నాలుగు నెలల కాంగ్రెస్‌ ప రిపాలనలో ఎక్కడా వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తా మని, సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాలికి గాయమైన ఆయన ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రచారాన్ని ప్రారంభించి ప్రజలను ఓటు అభ్యర్థిం చారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్‌రావు, మాజీ జడ్పీటీసీ కా టం జంబులయ్య, మునిసిపల్‌ కౌన్సిలర్‌ కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు రాంచం దర్‌యాదవ్‌, కలమూరి నిరంజన్‌, కోతుల వెంకటేశ్వర్లు, డీకే.మాదిగ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:09 PM