బీఆర్ఎస్ సంబురాలు
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:59 PM
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంతో ఆదివారం పేట సత్యనారాయణ చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు విజయసాగర్ ఆధ్వర్యంలో భాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
![బీఆర్ఎస్ సంబురాలు](https://media.andhrajyothy.com/media/2024/20240530/251npt02_8a1f43bb80.gif)
నారాయణపేట, జూన్ 2 : మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంతో ఆదివారం పేట సత్యనారాయణ చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు విజయసాగర్ ఆధ్వర్యంలో భాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన రోజు బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహిమూద్, గురులింగం, చెన్నారెడ్డి, కన్న జగదీశ్, గట్టు రఘు, ప్రకాశ్, ఫిరోజ్ పాల్గొన్నారు.
- ధన్వాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నవీన్రెడ్డి గెలుపొందడంతో దన్వాడ, గున్ముక్ల గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. ఽకార్యక్రమంలో గున్ముక్ల ఎంపీటీసీ సభ్యుడు సుదీర్కుమార్, బీఆర్ఎస్ నాయకులు టైలర్ శ్రీనివాస్గౌడ్, వడ్ల శాంతికుమార్, ముసిరిగారి నర్సిములు, శివారెడ్డి, ఎండీ నాసర్, చెట్టుకింది రాము, లంకాల గోపాల్ గౌడ్ పాల్గొన్నారు.
- మరికల్ : మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో మండలాధ్యక్షుడు లంబడి తిరుపతయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఇందిరాగాంఽధీ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల కోఅప్షన్ మెంబర్ మతీన్, నరసింహా, రాజారెడ్డి, శ్రీనివాసులు, కానుగంటి నారాయణ పాల్గొన్నారు.