బోరు మోటారు ప్రారంభం
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:50 PM
మండల పరిధిలోని బండగొండ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన మల్లయ్య గుడికి వచ్చే భక్తులకు మంచి నీటి వసతి కోసం వేసిన బోరును సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు.
![బోరు మోటారు ప్రారంభం](https://media.andhrajyothy.com/media/2023/20231205/101npt8_63bb581d26.gif)
నారాయణపేట రూరల్, జనవరి 8 : మండల పరిధిలోని బండగొండ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన మల్లయ్య గుడికి వచ్చే భక్తులకు మంచి నీటి వసతి కోసం వేసిన బోరును సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ తాగునీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డిని కోరడంతో తన సొంత డబ్బులతో బోరు వేయించారన్నారు. సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో ప్రజల అవసరాలను తీర్చుతున్న కుంభం శివకుమార్రెడ్డి సేవలు అభినందనీయం అన్నరు. తాను సైతం వారితో కలిసి సామాజిక సేవలో పాలు పంచుకుంటానన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాఘవేందర్రెడ్డి ఇటీవల ఊట్కూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని మనో ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సదాశివారెడ్డి, రాంచందర్, అఖిల్రెడ్డి, సందీప్రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.