బయో మెట్రిక్ హాజరు వేయాలి
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:45 PM
బయో మెట్రిక్ ద్వారా జిల్లాలోని ప్రతీ అధికారి తమ హాజరును వేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
నారాయణ పేట టౌన్, మార్చి 4 : బయో మెట్రిక్ ద్వారా జిల్లాలోని ప్రతీ అధికారి తమ హాజరును వేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ప్రజావాణి రద్దు సందర్భంగా ప్రజావాణి హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. బయో మెట్రిక్ ద్వారా జిల్లా అధికారులు, సిబ్బంది హాజరువేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వెబ్సైట్ అప్ డేట్ కోసం అధికారులు, సిబ్బంది తమ హోదా, ఫోన్ నంబర్లు ఏవోకు ఇవ్వాలని, అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సదరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి రద్దు చేశామని, ఎవరూ ఫిర్యాదులతో రావద్దని కలెక్టర్ ఫిర్యాదు దారులను కోరారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.