Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌

ABN , Publish Date - Mar 02 , 2024 | 10:57 PM

నాగర్‌కర్నూల్‌ లోకసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్‌ప్రసాద్‌ పోటీ చేయనున్నారు.

నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌
భరత్‌

నాగర్‌కర్నూల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ లోకసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్‌ప్రసాద్‌ పోటీ చేయనున్నారు. బీఆర్‌ఎ్‌సలో అంతర్గత విభేధాలు, రెండు సార్లు తన కుమారుడికి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశాలున్నప్పటికీ పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదనే ఆవేదన పోతుగంటి రాములులో ఉంది. ఈ నేపథ్యాన్ని అనేకసార్లు పార్టీ అంతర్గత, బహిరంగ సమావేశాల్లో సైతం ఆయన వెలిబుచ్చారు. అయితే రాష్ట్ర శాసన సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరాలని ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనయుడు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌ను నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధినాయకత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Mar 02 , 2024 | 10:58 PM