Share News

పాలమూరులో నేడు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:09 PM

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ము గ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన జిల్లా స్థాయి పోటీలు ఆదివారం పాలమూరులో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల మాడ్రన్‌ హైస్కూల్‌లో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి.

పాలమూరులో నేడు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

మాడ్రన్‌ హై స్కూల్‌లో ఏర్పాట్లు

ఉదయం 10 గంటలకు ప్రారంభం..

మహబూబ్‌నగర్‌, జనవరి 6: ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ము గ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన జిల్లా స్థాయి పోటీలు ఆదివారం పాలమూరులో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల మాడ్రన్‌ హైస్కూల్‌లో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రజ్యోతి ఏటా సంక్రాంతికి ముందు ముత్యాల ముగ్గుల పోటీలను సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తోంది. పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. చుక్కల ముగ్గుకు ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు ఎవరి రంగులు వారే తెచ్చుకోవాలి. ముగ్గు వేసేందుకు రెండు గంటల సమయం ఉంటుంది. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవీఎన్‌రెడ్డి, డీఈవో రవీందర్‌, తపస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ హాజరు కానున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:09 PM