ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటా
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:08 PM
కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతి క, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
![ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటా](https://media.andhrajyothy.com/media/2024/20240413/4klp17_337d267d43.jpg)
- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, ఏప్రిల్ 17: కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతి క, పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం కొ ల్లాపూర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి జూపల్లిని వివిధ గ్రామాల ప్రజలు వారి సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యలు విన్న మం త్రి వాటి పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో తాగునీ టి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్యలు తలెత్తినా ట్యాం కర్ల ద్వారా సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని మంత్రి ఆదేశించారు.