మదనగోపాలస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:06 PM
మండల పరిధిలోని జటప్రోల్ గ్రామంలో మదనగోపాలస్వామిని నాగర్కర్నూల్ అడిషనల్ కలెక్టర్ సీతారామారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

పెంట్లవెల్లి, జూన్ 7 : మండల పరిధిలోని జటప్రోల్ గ్రామంలో మదనగోపాలస్వామిని నాగర్కర్నూల్ అడిషనల్ కలెక్టర్ సీతారామారావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ ప్రాంగణానికి వచ్చిన అడిషనల్ కలెక్టర్కు ఆలయ అధికారులు, పూజారులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం అద్భుతమైన శిల్పి సౌందర్యం కలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మోత్కురి నాగిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ పరంధామరెడ్డి తదితరులున్నారు.