ఔటాన్ ప్రకారం పల్లి రైతులకు ధర నిర్ణయించాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 11:00 PM
ఔటాన్ ప్రకారం వేరుశనగ రైతులకు ధర ని ర్ణయించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, ఫిబ్రవరి 15: ఔటాన్ ప్రకారం వేరుశనగ రైతులకు ధర ని ర్ణయించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవ సాయ మార్కెట్ను సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు లకు అన్యాయం చేయకుండా ఔటాన్ తీసి ఆ తర్వాతనే ధర నిర్ణయించి రైతులకు చూపించాలన్నారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ దాడు లు చేయడం వల్ల అచ్చంపేట ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందని రైతులకు నచ్చజె ప్పారు. అచ్చంపేటలో దాడుల సంస్కృతికి చరమగీతం పాడాలని అన్ని వర్గాల ప్ర జలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రైతుల ముసుగులో ఇలాంటి దాడులకు పాల్పడితే ఎంతటివారినైన వదిలిపెట్టమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి అసెంబ్లీ సమావేశాలలో ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ సిబ్బందితో కలిసి పలు సమస్యలపై చర్చించారు. రైతుల ముందే ఔటాన్ తీసి చూయించారు. వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవ సాయ మార్కెట్ చైర్పర్సన్ అరుణ, మార్కెట్ సెక్రటరీ నర్శింహులు, నాయకులు రాజేందర్, చంద్రమౌళి, శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.