Share News

ఘనంగా ప్రతిష్ఠాపన దినోత్సవం

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:15 PM

నారాయణపేట రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోమవారం శోడష బాహు లక్ష్మీనర్సింహా సహిత గురు రాఘవేంద్ర బృందావన 108వ ప్రతిష్ఠాపన వేడుక లను వైభవంగా నిర్వహించారు.

ఘనంగా ప్రతిష్ఠాపన దినోత్సవం
మహా రథోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

నారాయణపేట, జనవరి 1 : నారాయణపేట రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోమవారం శోడష బాహు లక్ష్మీనర్సింహా సహిత గురు రాఘవేంద్ర బృందావన 108వ ప్రతిష్ఠాపన వేడుక లను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరసింహచారి స్వామి వారికి సుప్రభాతం, నిర్మాల్యం, పంచామృతాభిషేకం, తులసీ అర్చన, పుష్పార్చన, భజన, పల్లకీ సేవ, నైవేద్యం, సర్వసేవ, మహా రథోత్సవం నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు విద్వాన్‌ అనిల్‌ దేశాయ్‌ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. రాఘవేంద్ర స్వామి ఆలయం పట్టణం లో ఉండటం పూర్వజన్మ సుకృతమని, 108 ఏళ్లుగా నిత్య పూజలు అందుకుంటూ ధార్మిక దివ్య క్షేత్రంగా కొలిచే వారికి కొంగు బంగారమై విరాజిల్లుతుందన్నారు. కార్యక్రమంలో రాఘ వేంద్ర సేవా సమితి సభ్యులు సీతారామ్‌ దీక్షిత్‌, రాఘవేందర్‌ రావు, లక్ష్మీకాంత్‌ రావు, శ్రీని వాస్‌రావు, భీంసేన్‌ రావు, హన్మేష్‌, జయతీర్థ, గీత శేషు, నర్సింహారావు, గురురాజ్‌, అనంత్‌ రావు, కిషన్‌రావు, శ్వేత పద్మావతి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:15 PM