Share News

కొల్లాపూర్‌ పట్టణ అభివృద్ధికి రూ.8 కోట్లు

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:44 PM

కొల్లాపూర్‌ మునిసిపాలిటీని రాష్ట్రం లోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కొల్లాపూర్‌ పట్టణ అభివృద్ధికి రూ.8 కోట్లు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మేకల రమ్య, కౌన్సిలర్లు

- రాష్ట్రంలోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా

- రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్‌ మునిసిపాలిటీని రాష్ట్రం లోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్‌ పట్టణంలో రూ.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాటా ్లడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన తరు ణంలోని కొల్లాపూర్‌ మునిసిపాలిటీకి ఎప్పుడు లేని విధంగా రూ.8 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ నిధుల ద్వారా కొల్లాపూర్‌ మునిసిపల్‌ ప్రజలకు కావా ల్సిన వసతులు సమకూరు తాయన్నారు. పనులను వేగవంతంగా నాణ్యతగా చేయాలని అధికారులను, మునిసిపల్‌ పాలక మండలిని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లికి ఆ వార్డు ప్రజలు, కౌన్సిలర్లు సన్మానిం చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మేకల రమ్య, వైస్‌ చైర్మన్‌ మహ మూదా బేగం, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, కౌన్సిలర్లు, సింగిల్‌ విండో డైరెక్టర్‌, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 11:44 PM