Share News

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

ABN , Publish Date - Jan 22 , 2024 | 08:00 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిత్య కళ్యాణ మండపంలో ఉదయం సీతారాములకు సువర్ణ పుష్పార్చన చేసిన అనంతరం.. సీతారాములను పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర చేయనున్నారు. శ్రీ రామ ప్రచార రథంతో శోభాయాత్ర.. సాయంత్రం సుందరకాండ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అయోధ్య రాముడి ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అలాగే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు.. శోభాయాత్ర వంటి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 08:00 AM