Share News

కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:53 AM

దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి

గోదావరిఖని, ఫిబ్రవరి 12: దేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్‌ హోటల్‌లో బీజే పీ నాయకుడు అయోధ్య రవీందర్‌ ఆధ్వర్యంలో 200మంది బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాను న్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా తుడి చిపెట్టుకుపోయిందని, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వృథా అని అన్నారు. దేశంలో కాం గ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీలో నాయకులు కొట్టుకోవడానికే సరిపోతుందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌లో కాషాయజెండా ఎగురవేసి నరేంద్రమో దీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. పైతరి రాజు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రవీందర్‌, కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, అమరేందర్‌రావు, తోట కుమారస్వామి, ముష్కె సంపత్‌యాదవ్‌, అడిగొప్పుల రాజు, ధర్మాజీ, వినయ్‌, మహేందర్‌, సురేష్‌, నవీన్‌, నాగరాజు, కిరణ్‌, విశ్వాస్‌, పవ న్‌, గట్టయ్య, రాజేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:53 AM