స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చాలి
ABN , Publish Date - Aug 16 , 2024 | 01:05 AM
స్వాతంత్య్రం కోసం సర్వస్వం ధారపోసిన సమర యోధుల ఆశ యాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని రామగుండం అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు పేర్కొన్నారు.
కోల్సిటీ, ఆగస్టు 15: స్వాతంత్య్రం కోసం సర్వస్వం ధారపోసిన సమర యోధుల ఆశ యాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని రామగుండం అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు పేర్కొన్నారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా పోలీసులచే గౌర వ వందననాన్ని స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన త రువాత సుపరిపాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పోలీసులు గా సమాజంలో సమగ్రతకు, శాంతి స్థాపన కు కృషి చేయాలన్నారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో నీతినిజాయితీగా సేవలందిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, ఎస్బీ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ఫోర్స్ ఏసీపీ మల్లా రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, సూపరింటెండెం ట్ మదన్కుమార్, సీసీ పవన్రాజ్, గౌస్, సిబ్బంది పాల్గొన్నారు.