Share News

సింగిల్‌ విండో చైర్మన్‌గా సుమన్‌రెడ్డి ఎన్నిక

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:50 PM

మండలంలోని పొత్కపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నికకు మంగళవారం తెరతీశారు.

సింగిల్‌ విండో చైర్మన్‌గా సుమన్‌రెడ్డి ఎన్నిక

ఓదెల, ఫిబ్రవరి 27 : మండలంలోని పొత్కపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ వైస్‌చైర్మన్‌ ఎన్నికకు మంగళవారం తెరతీశారు. 20 రోజుల అనంత రం కార్యాలయంలో డీసీవో సమక్షంలో పోలీస్‌ భద్రత మధ్య ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రి యను నిర్వహించారు. చైర్మన్‌ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలైనందున పొత్కపల్లికి చెందిన ఆళ్ల సుమన్‌రెడ్డిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కనగర్తికి చెందిన తాళ్లపల్లి సదయ్య వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం డీసీవో చందుప ట్ల శ్రీమాల ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. 20రోజులపాటు చైర్మన్‌ ఎవ రనేది ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో, ఎట్టకేలకు సొసైటీ కమిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు, డైరెక్టర్‌ మూల ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డైరెక్టర్లు కట్కూరి కవిత, కాంతాల సమ్మిరెడ్డి, బొంగోని శ్రీనివాస్‌ గౌడ్‌, కోట విజయ, కొట్టే దేవేందర్‌,చింతం కుమారస్వామి, గూగుల్‌ పర్శరాం నాయ క్‌, అలాగే సీఈవో గోలి అంజిరెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:50 PM