గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:14 AM
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
![గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి](https://media.andhrajyothy.com/media/2023/20231205/2_94e1c484be.jpg)
బోయినపల్లి, జనవరి 31: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాన్వాడలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జెగ్గారావుపల్లెలో మురికి కాలువల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మర్లపేటలో జ్యోతిబాఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొదురుపాకలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉందని, త్వరితగతిన పథకాలను అమలు చేస్తామని అన్నారు. అంతకుముందు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఎంఈవో రామరాజు తేనీటి విందుకు అహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సెస్ డైరెక్టర్ కొట్లెపల్లి సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ వేసి రెడ్డి దుర్గారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కట్ట లచ్చయ్య, సర్పంచులు రామిడి శ్రీనివాస్, సంది సౌందర్యసంపత్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, నాయకు బండి శ్రీనివాస్, నాగుల వంశీ పాల్గొన్నారు.