రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 21 లక్షలు
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:37 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.2 కోట్ల 21 లక్షలకుపై ఆదాయం సమకూరింది.
![రాజన్న హుండీ ఆదాయం రూ.2 కోట్ల 21 లక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240326/4_35ee0e063d.jpg)
వేములవాడ, మార్చి 26 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.2 కోట్ల 21 లక్షలకుపై ఆదాయం సమకూరింది. 21 రోజుల వ్యవధిలో భక్తులు స్వామవారి హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో లెక్కించారు. ఈ సందర్భంగా 2 కోట్ల 21 లక్షల 29 వేల 350 రూపాయల నగదు, 463 గ్రాముల బంగారం, 19 కిలోల 800 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది రాజరాజేశ్వరసేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.