ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ‘ప్రజాదర్బార్’
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:09 AM
ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇక నుంచి ప్రజా దర్భర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ తెలిపారు.
![ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ‘ప్రజాదర్బార్’](https://media.andhrajyothy.com/media/2024/20240215/_3e8214dabf.jpg)
గోదావరిఖని, ఫిబ్రవరి 19: ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇక నుంచి ప్రజా దర్భర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్భర్ను నిర్వహించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం కోసం అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యల కోసం నేరుగా తనను సంప్రదించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచిం చారు. ప్రజలకు ఎవరైనా మాయమాటలు చెప్పి లంచాలు తీసుకుంటే ఉపేక్షించేది లేదని, ఇక నుంచి రామగుండంలో ప్రజారంజక పాలన ఉంటుందని, రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన ఎజెండా, లక్ష్యమని, త్వరలోనే లక్ష్మీనగర్లో రూ.10కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయ ని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ స్కీములు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మొదటి రోజు వచ్చిన సమస్యలను ఆయన అధికారులతో చర్చించి పరిష్కరించారు.