Share News

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:38 AM

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.లక్ష్మీనర్స య్య తెలిపారు.

ప్రశాంతంగా పాలిసెట్‌

పెద్దపల్లి రూరల్‌, మే 24 : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.లక్ష్మీనర్స య్య తెలిపారు. జిల్లాలో పాలిసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షకు 2330మంది విద్యా ర్థులకు 2116మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షకు వచ్చిన విద్యార్థులను నిర్వాహకులు తనిఖీలు చేసి పరీక్ష హాల్‌లోకి పంపించారు. ప్రతి విద్యార్థి హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌ కార్డు తప్పనిసరి నిబంధనలు ఉండటంతో ప్రతి విద్యార్థి ముందస్తుగా సిద్ధం చేసుకొని పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 5పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్ష నిర్వహ ణలో ఎలాంటి సంఘటనలు జరుగలేదని తెలిపారు. పరీక్షకు 1252బాలు రు, 1078 బాలికలు పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్షకు 90.80 శాతం హాజరైనట్లు జిల్లా కోఆర్డినేటర్‌ తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 12:38 AM