Share News

ఎన్టీపీసీని సందర్శించిన ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:44 PM

తెలంగాణ ఎన్‌పిడిసిఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి శుక్రవా రం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు.

ఎన్టీపీసీని సందర్శించిన ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ

జ్యోతినగర్‌, ఏప్రిల్‌ 26 : తెలంగాణ ఎన్‌పిడిసిఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి శుక్రవా రం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు. ఉదయం ఇక్కడికి వచ్చిన సీఎండీ వరుణ్‌రెడ్డికి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేదార్‌రంజన్‌ పాండు స్వాగతం పలికా రు. అనంతరం ఆయన ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో ఉన్న 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును సందర్శించారు. సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణలో సవాళ్లు తదితర అంశాలను ఎన్టీీసీ అధికారులు ఎన్‌పీడీసీ ఎల్‌ సీఎండీకి వివరించారు. తరువాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల తెలం గాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టిఎస్‌టిపిపి) ప్రాజెక్టులో పర్యటించారు. యూనిట్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి, ఇతర విషయాలను అధికారులు సీఎండీ వరుణ్‌రెడ్డికి వివరించారు. యూనిట్‌ బాయిలర్‌, ఇతర విభాగాలను సీఎం డీ పరిశీలించారు. ఎన్టీపీసీ వీజీపీ గెస్ట్‌హౌస్‌లో సీఎండీ వరుణ్‌రెడ్డి మొక్కను నాటా రు. ఈ పర్యటనలో ఎన్టీపీసీ వివిధ విభాగాల జీఎంలు, ఎన్‌పిడిసిఎల్‌ అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:44 PM