Share News

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:22 PM

పార్లమెంట్‌ ఎన్నికల లోపే మున్నూరు కాపు ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరుకాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొండ దేవయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య

జగిత్యాల అర్బన్‌, మార్చి 4: పార్లమెంట్‌ ఎన్నికల లోపే మున్నూరు కాపు ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరుకాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొండ దేవయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని స్థానిక ఎస్‌విఎల్‌ఆర్‌ గార్డెన్‌లో మున్నూరు కాపు సంఘ బాధ్యు లు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గత దశాబ్దకాలంగా మున్నేరు కాపుల అభివృద్ది కోసం, ప్రత్యేక కార్పోరే షన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గత ప్రభుత్వంకు విన్నవించినా పట్టిం చుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాన పార్టీల మెనిఫెస్టోలో పె ట్టాలని విజ్ఞప్తి చేసిన బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తమను గెలిపిస్తే విజ్ఞప్తిని అమలుచేస్తామని పేర్కొందన్నారు. కాం గ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతులు సమర్పించడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడి 80రోజులు గడిచిన నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే మున్నూరుకాపు కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘ బాధ్యులు, కులబాంధవులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:23 PM