Share News

యంత్ర సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 30 , 2024 | 12:32 AM

యంత్ర సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయ ణరావు అన్నారు.

యంత్ర సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి, మే 29: యంత్ర సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయ ణరావు అన్నారు. బుధవారం సింగరేణి సంస్థ ఏపీఏ డివిజన్‌ పరిధిలోని ఏఎల్‌ పీ గనిలో పర్యటించారు. లాంగ్‌వాల్‌లోని 3,4 సీమ్‌ పనుల పురోగతిపై చర్చిం చారు. అనంతరం డైరెక్టర్‌ మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా కొనసాగించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఉత్పత్తి ఎంత ముఖ్యమో రక్షణ కూడా అంతే ప్రాధాన్యం కల్పించాలని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో అధికారులు నాగేశ్వర్‌రావు, సీతారామం, రఘురాం, సుధాకర్‌, జనార్దన్‌లు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:32 AM