Share News

పూర్తి స్థాయిలో యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:55 PM

యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణరా వు సూచించారు.

పూర్తి స్థాయిలో యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలి

యైటింక్లయిన్‌కాలనీ, ఫిబ్రవరి 29: యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణరా వు సూచించారు. గురువారం ఓసీపీ-1 ప్రాజెక్టులో నూతన వీల్‌ లోడర్‌ను ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించా రు. ఈసందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడారు. ప్రాజెక్టు అవ సరాల దృష్ట్యా కొమట్స్‌ కంపెనీకి చెందిన 6.4 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంగల వీల్‌ లోడర్‌ను 4.83 కోట్లు వెచ్చిం చి కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు, సోలార్‌ జీఎం జానకిరాం, ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్‌ప్రెసిడెంట్‌ కోట రవీందర్‌ రెడ్డి, ఏఐటీయూసీ ప్రతినిధి డీటీ రావు, ఏరియా ఇంజ నీర్‌ ఎలీషా, పీవో రాధాకృష్ణ, పీఈ శ్రీనివాస్‌, మేనేజర్‌ ఉదయ్‌హరిజన్‌, బేస్‌వర్క్‌షాప్‌ ఇంచార్జి సత్యనారా యణ, కొమస్తు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:55 PM