Share News

ఈద్గా మైదానం పరిశీలన

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:14 AM

రంజాన్‌ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ గురువారం పరిశీలించారు.

ఈద్గా మైదానం పరిశీలన
మైదానాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌

వేములవాడ, ఏప్రిల్‌ 4: రంజాన్‌ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ సిబ్బంది ఈద్గా ఆవరణలోనిచెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. రంజాన్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఈద్గా మైదానంకు వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్‌ తరపున తగిన ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ ఈ సందర్భంగా తెలిపారు. మున్సిపల్‌ సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌, మసీద్‌ అధ్యక్షులు షేక్‌ ఇమామ్‌, ముస్లిం పెద్దలు షేక్‌ రియాజ్‌, సయ్యద్‌ అన్సర్‌, షేక్‌ ఇంతియాజ్‌, నాయకులు, షేక్‌ వాజిద్‌, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:14 AM