ఈద్గా మైదానం పరిశీలన
ABN , Publish Date - Apr 05 , 2024 | 12:14 AM
రంజాన్ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గురువారం పరిశీలించారు.
![ఈద్గా మైదానం పరిశీలన](https://media.andhrajyothy.com/media/2024/20240326/3_b198e2656e.jpg)
వేములవాడ, ఏప్రిల్ 4: రంజాన్ పండుగ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మునిసిపల్ సిబ్బంది ఈద్గా ఆవరణలోనిచెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఈద్గా మైదానంకు వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ తరపున తగిన ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఈ సందర్భంగా తెలిపారు. మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, మసీద్ అధ్యక్షులు షేక్ ఇమామ్, ముస్లిం పెద్దలు షేక్ రియాజ్, సయ్యద్ అన్సర్, షేక్ ఇంతియాజ్, నాయకులు, షేక్ వాజిద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.