ఘనంగా శేషవాహన సేవ
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:45 PM
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను శేష వాహనంపై అధిరోహించి దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు.
![ఘనంగా శేషవాహన సేవ](https://media.andhrajyothy.com/media/2024/20240413/001_9ed254493a.jpg)
ఇల్లందకుంట: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను శేష వాహనంపై అధిరోహించి దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేషవాహన సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షురెడ్డి సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.