Share News

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - May 31 , 2024 | 12:35 AM

సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం సీఐటీయూ కార్యాల యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు

కళ్యాణ్‌నగర్‌, మే 30: సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం సీఐటీయూ కార్యాల యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 1970 మే 30 ఆవిర్భవించిన సీఐటీయూ దేశంలో కార్మిక ఉద్యమం కోసం ఎనలేని కృషి చేస్తుందని, దేశంలోనే సీఐటీయూ అతిపెద్ద కార్మిక సంఘంగా అవతరించిందన్నారు. 1991లో ఏర్పడిన సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతి రేకంగా పోరాడిందని, బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసిందన్నా రు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మెండె శ్రీనివాస్‌, నాగమణి, రాజమౌళి, సురేష్‌, నారాయణ, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:35 AM