మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:10 AM
మండల కేంద్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధి లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
![మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి](https://media.andhrajyothy.com/media/2024/20240407/_0edd5bdf1d.jpg)
ఓదెల, ఏప్రిల్ 7 : మండల కేంద్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి సన్నిధి లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉగాది పండుగను పురస్కరించుకొని ముందస్తుగా భక్తులంతా ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. అలాగే మల్లికార్జున స్వామికి బోనాలను సమర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన ప్రాంగణమంతా శివసత్తుల పూన కాలతో సందడి నెలకొంది. బంగారు పోచమ్మ, మదన పోచమ్మ ఆలయాల్లో భక్తులు మొక్కులను సమర్పించారు.