Share News

కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:13 AM

కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు.

కాంగ్రెస్‌ గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం

కళ్యాణ్‌నగర్‌, జనవరి 6: కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 202మంది లబ్దిదారులకు రూ.2.02కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టారని చెప్పారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పథకం కింద నిరుపే దలకు రూ.10లక్షల ఆరోగ్య బీమా అందించడం జరిగిందని, మిగిలిన నాలుగు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. ఆడపిల్లళ్ల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం క్రింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేయడం జరుగుతుందని చెప్పారు. రామగుండం ప్రజలు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చునని, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన చెప్పారు. ఈనెల 16 నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్‌ కుమారస్వామి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, కొలిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, నాయకులు పెద్దెల్లి ప్రకాష్‌, పాతిపెల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, ఫజల్‌బేగ్‌, దశరథం, గట్ల రమేష్‌, మారెల్లి రాజిరెడ్డి, గుండేటి రాజేష్‌, తిప్పారపు శ్రీనివాస్‌, బయ్యపు మనోహర్‌రెడ్డి, తాళ్లపల్లి యుగంధర్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:13 AM