Share News

పర్యావరణ దినోత్సవం నిర్వహణపై సమావేశం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:18 AM

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సంద ర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై బుధ వారం ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పర్యావరణ దినోత్సవం నిర్వహణపై సమావేశం

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 17: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సంద ర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై బుధ వారం ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుసంధానంతో మిషన్‌ లైఫ్‌పై నెలరో జుల పాటు అవగాహన కార్యక్ర మాలు నిర్వహించనున్నట్టు జీఎం పేర్కొ న్నారు. గనులపై, ఉద్యోగుల కాలనీల్లో సమావే శాలు నిర్వహించడం, సైకిల్‌ ర్యాలీలు, ఈ వ్యర్థాల సేకరణ, క్విజ్‌, సెమినార్లు, వర్క్‌ షాప్‌లు విజయవంతం అయ్యేలా చూడా లని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు శ్రీని వాస్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, ఎర్రన్న, రాజేంద్రప్రసాద్‌, ధనుంజయ, మురళీ కృష్ణ, అభిలాష్‌, సృజన్‌ మెహ్ర, సురేష్‌ బాబు, రంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:18 AM